రెచ్చిపోయిన ఆకతాయిలు.. కొండపై భారీగా మంటలు

by  |
రెచ్చిపోయిన ఆకతాయిలు.. కొండపై భారీగా మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. శుక్రవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు దేవకొండకు నిప్పు పెట్టారు. దీంతో కొండపై ఒక్కసారిగా మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, దేవకొండ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ కొండపై మంటలు చెలరేగడంతో భక్తులు భయందోళనకు గురయ్యారు. దేవకొండ శివారులోని గుడిసెల్లో నివాసముంటున్న వారిని పోలీసులు ఖాళీ చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యా్ప్తు చేపట్టారు.


Next Story

Most Viewed