విషం చల్లి చంపేశారు 

by  |
విషం చల్లి చంపేశారు 
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం తాళ్లూరులో విషప్రయోగం చేసి హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. హోటల్ వ్యాపారి బ్రహ్మయ్యపై దుండగులు విషం కలిపిన స్ప్రే ప్రయోగించి హత్య చేశారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో హోటల్ ను శుభ్రం చేసి, వ్యర్ధాలను ఆరుబయట పడేసేందుకు వెళ్ళాడు బ్రహ్మయ్య.

తిరిగి వస్తుండగా బైక్ పై వచ్చిన దుండగులు విషం స్ప్రే చేశారు. బాధితుడిని వైద్యంకోసం సత్తెనపల్లి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. అతని మరణంతో కుటుంబసభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. బ్రహ్మయ్య చాలా సౌమ్యుడని, అతనిని చంపేంత కక్ష ఎవరికీ ఉందా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.


Next Story

Most Viewed