- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పటల్ సమీపంలో గల ఏటీఎంలో అగ్ని ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి ఏటీఎం మెషిన్ కి నిప్పుపెట్టి పరారయ్యారు. ఈ ప్రమాదంలో ఏటీఎం మెషిన్ పూర్తిగా దగ్దమైంది. మంటలను గమనించిన ఇంటి యజమాని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ముంబైలోని యాక్సిస్ బ్యాంకు కంట్రోల్ రూమ్ నుంచి మహబూబాబాద్ పట్టణ పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఆగంతుకులను పట్టుకునేందుకు పోలీసులు సంఘటనా స్థలం సమీపంలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆగంతకులు ఏటీఎంలో చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో ఏటీఎం దగ్ధం చేశారా..? మరేదైనా కారణమా..? అనేది పోలీసుల విచారణలో తెలియాల్సిఉంది.