గుడిలో సీసీ కెమెరాలు ఎత్తుకెళ్లిన దుండగులు

by  |
Dhongalu-12
X

దిశ, రాజేంద్రనగర్: తాళాలు పగులగొట్టి గుడిలో ఉన్న వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దేవాలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రామంజాపురం గ్రామంలో ఉన్న వెంకటేశ్వర దేవాలయంలో సోమవారం అర్ధరాత్రి తాళాలు పగులగొట్టి గర్భగుడిలో ఉన్న దేవతామూర్తుల 3 వెండి కిరీటాలు, వెండి శఠగోపం, హుండీలో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలను కూడా ఎత్తుకెళ్లారు‌. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు క్లూస్ టీం, డాగ్ తో వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed