అయోధ్య, ఆగస్టు 15న ఉగ్ర కుట్ర!

by  |
అయోధ్య, ఆగస్టు 15న ఉగ్ర కుట్ర!
X

దిశ, వెబ్‌డెస్క్: పాక్‌ ఉగ్రవాదులు భారత్‌పై భారీ స్కెచ్ వేశారు. పెద్ద ఎత్తున ఉగ్రదాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా అయోధ్య రామమందిరం భూమిపూజ, ఆగస్టు 15 వేడుకలను ఐఎస్ఐ టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అయోధ్య రామాలయం భూమి పూజ రోజున అతిపెద్ద ఉగ్ర దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

ఈ నేపథ్యంలోనే పాక్‌కు చెందిన ఉగ్రవాదులను భారత్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులకు ఐఎస్‌ఐ శిక్షణ ఇస్తున్నట్లు.. ఇందులో ఐదుగురు టెర్రరిస్టులో భారత్‌కు పంపినట్లు తెలుస్తోంది. నిఘా వర్గాల హెచ్చరికలతో జమ్ము కశ్మీర్, అయోధ్యలో భద్రతా దళాలు భారీగా మోహరించాయి.

Next Story