- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా కారణంగా ఆలయాలు మూసివేయడంతో రాష్ట్రంలోని ఆలయాలకు భారీగా ఆదాయం తగ్గింది. ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో ఆలయాలు తెరుచుకోగా.. ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు దేవాదాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్ఆర్ఐ భక్తుల నుంచి విరాళాలు రాబట్టేందుకు సిద్ధమైంది. ఆలయాలకు విరాళాలు ప్రకటించేందుకు ఇప్పటికే చాలామంది ఎన్ఆర్ఐలు ఆలయ అధికారులకు సంప్రదించారు. ఈ క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా విరాళాలను డొనేట్ చేసేందుకు యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ ఐటీశాఖ రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ ‘‘T APP FOLIO’’ ను గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. అయితే, ఈ యాప్లో ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేకంగా ఆప్షన్ను తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా ప్రస్తుతానికి యాదాద్రి, హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ, పెద్దమ్మ గుడి, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, కర్మాన్ ఘాట్ ఆలయాలకు విరాళం ఇవ్వొచ్చు. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోని మరిన్ని ఆలయాలకు దీని ద్వారా విరాళాలు పంపించొచ్చని మంత్రి తెలిపారు.