Good news for RTC workers: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్..

by  |
Good news for RTC workers: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు ఆదివారం నుంచి వ్యాక్సిన్​వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆర్టీసీలో కరోనా బాధితులు ఎక్కువైన కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కరోనా బారినపడి దాదాపు 50 మందికిపైగా కార్మికులు చనిపోయారని, 1,800 మందికిపై బాధితులున్నారని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్.. ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 49 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లతో పాటు సిబ్బందికి టీకాలు వేయనున్నారు.



Next Story

Most Viewed