కొత్త పథకం.. తెలంగాణ గౌడ్స్‌కు కేసీఆర్ గుడ్‌న్యూస్

by  |
కొత్త పథకం.. తెలంగాణ గౌడ్స్‌కు కేసీఆర్ గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు తీపి కబురు అందిస్తోంది. నూతన పథకాలకు శ్రీకారం చుడుతూ ప్రజలను దగ్గర చేసుకుంటోంది. దళితులకు ‘దళితబంధు’, యాదవ్‌లకు గొర్రెల పంపిణీ, ముదిరాజ్‌లకు ట్రాలీలను ఫ్రీగా అందించింది. ఇలా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం తనదైన ముద్ర వేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టి.. గీత కార్మికులకు శుభవార్తను అందించింది. ఇంతకీ ఆ పథకం ఏంటీ అనుకుంటున్నారా..! మన రాష్ట్రంలో రెండు లక్షల మంది కల్లు గీత కార్మికులున్నారు. అయితే వారందరికీ ద్విచక్ర వాహనాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం అమలు కోసం 1200 కోట్లు కేటాయించినట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మొదటి దశలో 15 వేల మంది లబ్ధిదారులకు మోపెడ్స్ అందిస్తామని ఆయన తెలిపారు.


Next Story

Most Viewed