- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > సర్పంచ్పై చర్యలు తీసుకుంటాం.. పెట్రోల్ దాడి ఘటనపై కలెక్టర్ సీరియస్
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కుభీర్ మండలం ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ రావుల రాజుపై పాత సాంవ్లీ సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్ పోసి నిప్పు అంటించిన ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జిల్లా ఇంచార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్ నిర్మల్ పట్టణంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజును పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. టెక్నికల్ అసిస్టెంట్ రాజుకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. మెరుగైన వైద్య సేవల కోసం ఈ రోజు రాత్రి హైదరాబాద్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన సర్పంచ్పై చట్ట పరంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తెలిపారు.
Next Story