రాబోయే ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సన్నద్ధం కావాలి

by  |
TDP
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్క నర్సింహులు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో నాగార్జునసాగర్ నియోకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ గ్రామస్థాయిలో టీడీపీ బలంగా ఉందన్నారు. వారిలో మనోధైర్యం కల్పించాలని సూచించారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు.

సాగర్ నియోజకవర్గం ఇన్చార్జి మువ్వ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఊడుతూరు నరసింహారెడ్డి, కొట్టే శ్రీనివాస్ యాదవ్, సబ్బు బలరాం రెడ్డి, శాగం లింగారెడ్డి, ఎస్ కే జమీళ్లు, దాసరి సైదులు, మంద తిరుపతయ్య, కర్ణ రమణారెడ్డి, షేక్ షాపుదిన్, తెలుగు యువత నాయకులు కంచర్ల వెంకన్న శంకర్ గౌడ్, జిల్లపల్లి ఉపేందర్ నాయుడు, హాలియా పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వేముల రామస్వామి ముజ్జా రవి తదితరులు పాల్గొన్నారు.



Next Story