స్వర్ణప్యాలెస్ కేసులో సుప్రీం కీలక తీర్పు 

by  |
స్వర్ణప్యాలెస్ కేసులో సుప్రీం కీలక తీర్పు 
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దర్యాప్తు కొనసాగించవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

కేసు దర్యాప్తు కొనసాగించేందుకు ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. దర్యాప్తుకు సహకరించాలని రమేష్ హాస్పిటల్ సిబ్బందికి సూచించింది. అటు డాక్టర్ రమేష్ బాబును అదుపులోకి తీసుకోకుండా విచారించాలని అధికారులకు ఆదేశించింది.

Next Story