కోతులకు భ‌య‌ప‌డి బిల్డింగ్‌పై నుంచి ప‌డిపోయి విద్యార్థిని..

by  |
కోతులకు భ‌య‌ప‌డి బిల్డింగ్‌పై నుంచి ప‌డిపోయి విద్యార్థిని..
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : కోతుల‌ను త‌ప్పించుకునే కంగారులో విద్యార్థిని బిల్డింగ్ మీద నుంచి ప‌డి మృతి చెందింది. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న వ‌రంగ‌ల్ అర్భ‌న్ జిల్లా భ‌ట్టుప‌ల్లిలోని దీన్‌ద‌యాల్ గ్రామీణ ఉపాధ్యాయ శిక్ష‌ణ కేంద్రంలో చోటుచేసుకుంది. రేగొండ మండలం నగుర్లపల్లికి చెందిన గంజి శిరీష (21) ఎంసీఏ చ‌దువుకుంటోంది. కొద్దిరోజులుగా భ‌ట్టుప‌ల్లిలోని దీన్‌ద‌యాల్ గ్రామీణ ఉపాధ్యాయ శిక్ష‌ణ కేంద్రంలో వ‌స‌తి పొందుతోంది.

బుధ‌వారం సాయంత్రం స‌మయంలో బిల్డింగ్ పైకి వెళ్లిన శిరీషకు కోతులు క‌నిపించాయి. ఒక్కసారిగా కోతులు మీద‌కు వ‌స్తుండ‌టంతో భ‌యపడింది. వాటి నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో బిల్డింగ్ మీద నుంచి ప‌డిపోవ‌డంతో తీవ్ర‌గాయాల‌తో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది.



Next Story

Most Viewed