రాష్ట్రంలో నాలుగు కాలాలు: రసమయి

by  |
రాష్ట్రంలో నాలుగు కాలాలు: రసమయి
X

దిశ, కరీంనగర్: సమాజమంతా మూడు కాలలే ఉంటే తెలంగాణ ప్రజలకు మాత్రం నాలుగు కాలాలు రానున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. బుధవారం మానకొండూరు నియోజకవర్గంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి మాట్టాడుతూ… వానాకాలం, చలికాలం, వేసవి కాలం సహజ సిద్ధంగా వచ్చేవే.. కానీ, రాష్ట్రంలో నీళ్ల కాలం కూడా కొత్తగా వస్తుందన్నారు. నాలుగో కాలమే నీళ్ల కాలమని, 365 రోజులూ రాష్ట్రం అంతా జలకళ సంతరించుకుంటోందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 47 చెరువులను కాళేశ్వరం నీటితో నింపామని, త్వరలో మిగతా చెరువుల్లోకి కూడా నీరు వచ్చి చేరుతుందన్నారు. అలాగే నియోజకవర్గంలోని వాగుల్లో కూడా నీరు పుష్కలంగా రానుందన్నారు.

Next Story

Most Viewed