బ్రేకింగ్: విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

by  |
school students
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, కరోనా కారణంగా ఎక్కవ శాతం ఆన్లైన్‌లోనే తరగతులు నిర్వహించారు. దీంతో అనేకమంది విద్యార్థులు సిలబస్‌ను అర్థం చేసుకోలేకపోయారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది 1 నుంచి 10వ తరగతులకు 30 శాతం సిలబస్‌ను తగ్గించి, 70 శాతం సిలబస్‌ను మాత్రమే బోధించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సోమవారం జారీ చేసింది. గతేడాది నిర్ణయించిన విధంగానే ఈ ఏడాది కూడా అదే సిలబస్‌ను అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.



Next Story