- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన తండ్రిని కుమారుడు కర్రతో కొట్టిచంపాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… కోదాడ పట్టణంలో గుడిబండ రోడ్లో లారీ డ్రైవర్ సైదులు(45) కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. అయితే.. సైదులు రోజూ తాగి ఇంటికొచ్చి భార్యతో గొడవ పడడం ప్రారంభించారు. నిత్యం తల్లిని కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తుండటంతో భరించలేక చిన్నకుమారుడు చందు కోపంతో తండ్రి తలపై కర్రతో గట్టిగా కొట్టాడు. దీంతో సైదులుకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆందోళనతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సైదులు మృతిచెందాడు. పెద్ద కుమారుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన సీఐ నరసింహరావు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.