మద్యం మత్తులో అన్న.. రోకలి బండతో చంపిన చెల్లి

by  |
మద్యం మత్తులో అన్న.. రోకలి బండతో చంపిన చెల్లి
X

దిశ, వెబ్‌డెస్క్ : కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తోడపుట్టిన అన్ననే చెల్లి రోకలిబడతో కొట్టి చంపిన ఘటన జిల్లాలోని విద్యానగర్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. విద్యానగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఫుల్‌గా తాగి ఇంటికి వచ్చాడు. తాను ఇంటికి రాగానే చెల్లి కనిపించింది. దీంతో మద్యం మత్తులో వావివరసలు మరిచిపోయి చెల్లితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే తనను తాను కాపాడుకునేందుకు దగ్గరిలో ఉన్న రోకలిబండను అన్న మీదకు విసిరేసింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మద్యానికి బానిసైన అన్న తనను రోజు వేధించడం వలనే తాను ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులకు తెలిపింది. కాగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed