- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామ కారదర్శి సాయికృష్ణ పంచాయతీ నిధులు దుర్వియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆ గ్రామ సర్పంచ్ ఆర్.ప్రమీల సోమవారం ఎంపీడీఓకు ఫిర్యాదుకు చేసింది. గ్రామంలో ఇంటి పన్నులు, నల్లా పన్నులు వసూలు చేస్తూ, తప్పుడు లెక్కలు చూపిస్తున్నాడని, పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. అంతేగాకుండా.. నూతనంగా నిర్మించే ఇండ్లకు అనుమతి ఇచ్చే విషయంతో పాటు గ్రామ పంచాయతీ నుండి జారీచేసే సర్టిఫికెట్లకు కూడా ప్రజల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ నోట్ను సొంతానికి వాడుకుంటున్నాడని ఆరోపించింది. అనేక విషయాల్లో సర్పంచ్, పాలకవర్గ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిధులను సొంతానికి వాడుకుంటూ, లెక్కలు రాయకుండా సొమ్ము చేసుకుంటున్నడని ఫిర్యాదులో పేర్కొంది. అవినీతికి పాల్పడుతున్న కార్యదర్శిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను కోరారు.