- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, బేగంపేట: ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఓ మహిళ అక్కడిక్కడే మరణించింది . ఈ ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది . కార్ఖానా కాకాగూడకు చెందిన భూక్యా పద్మ ( 35 ) విజయేందర్లు భార్యాభర్తలు . వీరికి ఒక కుమారుడు , ఒక కుమార్తె ఉన్నారు . భర్త విజయేందర్ మేస్త్రి పనులు చేస్తుండగా పద్మ ఇండ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు . బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో భార్యాభర్తలు యాక్టివా వాహనంపై రాణిగంజ్ డ్రిల్లింగ్ మిషన్ కొనుగోలు చేసేందుకు వెళుతున్నారు . అదే సమయంలో అబ్దుల్ గంజి వెళుతున్న ఫారూఖ్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ( రూట్ నెంబర్ 8 ఏ ) మితిమీరిన వేగంతో వెనుక నుంచి వచ్చి వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది . దీంతో ఆమె తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించింది . భర్త విజయేందర్ కు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు . వెంటనే మహంకాళి ఎస్సై మహేందర్ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు . ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు .