- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ బస్ కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన బస్ కండక్టర్ ఎస్.వెంకటేష్ ఇబ్రహీంపట్నం నుంచి బీఎన్ రెడ్డి వైపు నడుస్తోన్న బస్సులో విధులు నిర్వహిస్తున్నాడు. బీఎన్ రెడ్డి నగర్కి చెందిన కృష్ణస్వామి వెంకటేష్ కండక్టర్గా ఉన్న బస్సులో ఎక్కాడు. ఈ క్రమంలో బస్సు ఎంజీబీఎస్ వైపు ప్రయాణిస్తుండగా కృష్ణస్వామి జేబులోంచి ఫోన్ జారీ పడిపోయింది. బస్సు కండక్టర్ గమనించి, పోగొట్టుకున్న వ్యక్తికి, డిపో మేనేజర్కి సమాచారం అందించారు. డిపో మేనేజర్ శ్రీబాబునాయక్, సదరు వ్యక్తిని పిలిపించి సెల్ ఫోన్ తిరిగిచ్చారు. దీంతో సెల్ఫోన్ను బాధ్యతగా తిరిగిచ్చి మానవత్వం చాటుకున్న కండక్టర్ వెంకటేష్కు కృష్ణస్వామి కృతజ్ఞతలు తెలిపారు. డిపో మేనేజర్, తోటి ఉద్యోగులు అభినందించారు.
Next Story