తెలంగాణ ఖ్యాతిని దేశ నలుమూలల చాటాలి: ఎంపీ రంజిత్ రెడ్డి

by  |
mp-Ranjithreddy1
X

దిశ, శేరిలింగంపల్లి: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గల గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన మస్కు నరేందర్ కుమార్తె మస్కు నేహా, కోచ్ సుధాకర్ యాదవ్ మార్గ నిర్దేశనంలో న్యూ ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరుపున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి నేహా, కోచ్ ను సత్కరించి అభినందనలు తెలిపారు. ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో క్రీడల్లో సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. క్రీడల ద్వారా మన రాష్ట్ర ఖ్యాతిని దేశ నలుమూలల చాటాలని ఆకాంక్షించారు.



Next Story

Most Viewed