బ్యాంకుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి

by  |
బ్యాంకుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్​కుమారస్వామి డిమాండ్ చేశారు. హైదరాబాద్​లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపారు. బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని, వారి డబ్బుకు భరోసా ఉండదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు సంక్షేమ పథకాలు దూరమవుతాయన్నారు. ప్రతీ ఉద్యోగి బ్యాంకు ఉద్యోగులకు మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్​ పి.పురుషోత్తం, మహిళా అధ్యక్షురాలు డాక్టర్​ జి.నిర్మల, కోశాధికారి గడ్డం బాలస్వామి, సభ్యులు ఆనంద్ యాదవ్, సైఫా బేగం, రాజేశ్వరి, దేవకి పాల్గొన్నారు.

Next Story