పోలీసుల నుంచి ఎస్కేప్.. ఒళ్లు చింతపండు చేసిన జనం !

by  |
పోలీసుల నుంచి ఎస్కేప్.. ఒళ్లు చింతపండు చేసిన జనం !
X

దిశ, వెబ్‌డెస్క్: పోలీసుల నుంచి తప్పించుకున్న ఓ దొంగను వెంబడించి పట్టుకున్న స్థానికులు.. ఒళ్లు చింతపండు అయ్యేలా కొట్టారు. బేగంబజార్‌లో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తనిఖీల్లో భాగంగా ఓ బైక్‌ దొంగను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహనంలో ఎక్కించే క్రమంలో పోలీసులను నెట్టేసి పరుగులు పెడుతున్న దొంగను స్థానికులు పట్టుకొని చితకబాదారు. తర్వాత పోలీసులకు అప్పగించారు.


Next Story

Most Viewed