దారుణం: తమ్ముడిని పొడిచి చంపిన అన్న

by  |
murder
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అన్నదమ్ముల మధ్య ఘర్షణ కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన సాబేరా బేగంకు నలుగురు కొడుకులు ఉన్నారు. అందులో ముగ్గురికి వివాహం జరిగింది. దీంతో అందరూ వేరే ఇళ్లలోకి మారి జీవనం కొనసాగిస్తున్నారు. ఇంట్లో చిన్నవాడైన ముజ్జు తల్లితో సొంత ఇంట్లో ఉంటున్నాడు. దీంతో ఇంట్లో అందరికంటే పెద్దవాడైన మహ్మద్ షాదుల్ గత కొంతకాలంగా ఆస్తి పంపకాలు చేయాలని, డబ్బులు కావాలని తల్లిని వేధించసాగాడు. శుక్రవారం రంజాన్ పండుగరోజు సైతం డబ్బుల కోసం తల్లి వేధించాడు.

దీంతో తమ్ముడు ముజ్జు పండుగ సమయంలో గొడవలు ఎందుకని అన్నతో వాదించాడు. ఎంతకీ వినకపోవడంతో రాడ్‌తో అన్న షాదుల్ తలపై గట్టిగా కొట్టాడు. దాంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ క్రమంలో తమ్ముడిపై కత్తితో దాడిచేశారు. పొట్ట భాగంలో, చాతిలో కిరాతకంగా పొడిచి పారిపోయాడు. దీంతో తమ్ముడు ముజ్జుకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా, పరిస్థితి విషమించి, మార్గం మధ్యలో మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు.

Next Story