జాగ్రత్త.. లక్ష దాటింది

by  |
జాగ్రత్త.. లక్ష దాటింది
X

దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్నది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు లక్షా దాటాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 4970 మందికి కరోనా సోకగా, 134 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 1,01,139 గా ఉంది. ఇప్పటివరకు 39,173 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం 58,802 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3163 మంది కరోనా కోరలకు చిక్కి మృతిచెందారు.

Next Story

Most Viewed