అలా భావించే… తామీ నిర్ణయం తీసుకున్నాం

by  |
అలా భావించే… తామీ నిర్ణయం తీసుకున్నాం
X

దిశ, సిరిసిల్ల: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని బార్బర్ షాపులను మూసివేస్తున్నట్టు నాయి బ్రాహ్మణ సంఘం ప్రకటించింది. సోమవారం నుంచి 15 రోజుల పాటు స్వచ్ఛందంగా షాపులను మూసివేస్తున్నట్టు సంఘం ప్రతినిధులు తెలిపారు. కరోనా బారిన పడి నాయి బ్రాహ్మణులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని భావించి తామీ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ కట్టను అధికారులు మూసివేయగా తాజాగా నాయి బ్రాహ్మణుల సంఘం కూడా ఈ నిర్ణయం తీసుకుంది.

Next Story

Most Viewed