మాట్లాడుదాం రా.. అని చెట్ల పొదల్లోకి పిలిచి బీరుసీసాను..

by  |
మాట్లాడుదాం రా.. అని చెట్ల పొదల్లోకి పిలిచి బీరుసీసాను..
X

దిశ, నాగార్జునసాగర్ : పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు తన ప్రేమించిన యువతిపై బీరు సీసాతో అతి దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. మాట్లాడుదాం రా.. అని చెట్ల పొదల్లోకి పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన చందన(20), అనుముల మండలం కోరిమోనిగూడెనికి చెందిన శంకర్(19) గత కొంత కాలంగా ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. వరికోత మిషన్ డ్రైవర్‌గా పని చేస్తున్న శంకర్.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాట్లాడేది ఉంది రమ్మంటూ చందనను సాగర్‌లోని పాత శివమ్ హోటల్ రప్పించాడు. ఆమెను ఆ హోటల్ వెనుక భాగం కొంత దూరం తీసుకెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని శంకర్ కోరడంతో చందన నిరాకరించినట్లు తెలుస్తోంది.

Lover

ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి యువతిని బీరు సీసాతో పొడిచి, బండరాయితో మోది దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన చందన ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె హతమైన తర్వాత శంకర్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ హత్యపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.



Next Story

Most Viewed