మాజీ MP సుబ్బిరామిరెడ్డికి బిగ్ షాక్.. ముంబై కంపెనీ భారీ మోసం

by  |
మాజీ MP సుబ్బిరామిరెడ్డికి బిగ్ షాక్.. ముంబై కంపెనీ భారీ మోసం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు సుబ్బిరామిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ముంబైకి చెందిన ఓ కంపెనీ భారీ మోసం చేసింది. రూ.11 కోట్ల విలువచేసే షేర్ల వ్యవహారంలో మోస పోయాను అని తెలుసుకున్న సుబ్బిరామి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముంబైకి చెందిన ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ లోన్ వ్యవహారంలో 1% షేర్ల బదిలీకి సుబ్బిరామిరెడ్డి భార్య ఒప్పందం చేసుకుంది. కానీ సుబ్బిరామిరెడ్డి కుటుంబానికి తెలియకుండానే ముంబై కంపెనీ షేర్ అమ్ముకుంది. ఈ వ్యవహారంలో ఛాంపియన్ పిన్స్ లిమిటెడ్‌కు చెందిన చేతన్ పటేల్, హర్షవర్ధన్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story

Most Viewed