- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, హుస్నాబాద్: కంటికి రెప్పలా చూడాల్సిన కన్నతల్లి కసాయిలా మారి ఆడ కూతురిని అనాథ చేసి ముళ్ల పొదల్లో పారేసింది. ఆడపిల్లా అని భారంగా భావించిందో లేదా మరేదైనా కారణం ఉందో తెలియదు కాని లోకం తెలియని పసికందును అనాథను చేసి అడివిలో విడిచింది తల్లి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. తోటపల్లి గ్రామ శివారులోని ప్రధాన రహదారి నుంచి గ్రామస్తులు తెల్లవారుజామున నడిచి వెళ్తున్న క్రమంలో ఓ చిన్నారి ఏడుపు వినిపిచడంతో స్థానికులు ముళ్లపొదల్లో వెతకగా పసికందు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి శిశువును తరలించడంతో పాటు స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు పాల్పడిన తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.