దారుణం.. కొడుకు గొంతు నులిమి చంపిన తల్లి

by  |
దారుణం.. కొడుకు గొంతు నులిమి చంపిన తల్లి
X

దిశ, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దారుణం జరిగింది. కొడుకును కన్నతల్లి హత్య చేసింది. ఈ ఘటన చేవెళ్ల మండలం రామన్నగూడలో బుధవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. రామన్నగూడానికి చెందిన మహేశ్వరీ-తన మామ వెంకటయ్యతో గతకొన్ని రోజులుగా ఇంట్లో గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం కూడా ఇరువురి మధ్య ఘర్షణ తీవ్రతరం అయిది. దీంతో ఆగ్రహానికి గురైన మహేశ్వరీ భారీగా మద్యం సేవించింది. తాగిన మైకంలో మామ వెంకటయ్య మీద కోపాన్ని కన్న కొడుకుపై చూపించి, రెండేండ్ల బాలుడి గొంతు నులిమి హత్య చేసింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed