పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం : స్టీఫెన్ రవీంద్ర

by  |
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం : స్టీఫెన్ రవీంద్ర
X

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని సీసీ టీవీ కంట్రోల్ రూమ్‌లో ఉప ఎన్నికల మొబైల్ పార్టీ వాహనాలు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ వాహనాల కదలికలను, లొకేషన్లను హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీపీ స్టీఫెన్ రవీంద్ర, నిజామాబాద్ రేంజ్ ఐజీపీ శివ శంకర్ రెడ్డిలు కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.


Next Story

Most Viewed