- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,ఉట్నూర్: ఖానాపూర్ నియోజకవర్గంలో లాక్డౌన్ ఏవిధంగా అమలౌతుందో తెలుసుకునేందుకు ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్ స్వయంగా ఉట్నూర్ మండల కేంద్రంలో అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటికి రాకుడదని ఆమె సూచించారు. లాక్ డౌన్ పరిస్థితులపై ఎస్ ఐ సుబ్బారావుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఉట్నూర్లోని లక్కారం, ఇంద్రవెలి మండలంలోని కొన్ని గ్రామాల్లో పర్యటించి సీఎం సహాయక నిధి చెక్కులను, లబ్ధి దారులకు అందజేశారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి వెళ్లకూడదని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. అలానే లాక్ డౌన్ లో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు. ఈ పర్యవేక్షణ లో ఎంపీపీ పంద్రా జై వంత్ రావు, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, మండల అధ్యక్షుడు సింగారే, భారత్ అజీమ్ అన్వర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Next Story