మూసీలో మరో వ్యక్తి గల్లంతు

by  |
మూసీలో మరో వ్యక్తి గల్లంతు
X

దిశ, డైనమిక్ బ్యూరో : గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలకు హైదరాబాద్ లోని చెరువులు, నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపై నీరు చేరి వారం రోజుల క్రితం మణికొండలో యువకుడు మరణించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, శుక్రవారం మూసి నదిలో వ్యక్తి గల్లంతు అయ్యారు. చాదర్‌‌ఘాట్ వద్ద మూసీలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే, గల్లంతైన వ్యక్తి శంకర్ నగర్ కి చెందిన జహంగీర్ గా గుర్తించారు. రంగంలోకి దిగిన అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story