కరోనా టెస్టు కోసం వచ్చి.. పరీక్ష కాగానే కుప్పకూలిన వ్యక్తి.. చివరకు

by  |
corona patient
X

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లా ధర్మపురి ఆరోగ్య కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరోనా టెస్టు కోసం వచ్చి పరీక్ష కాగానే ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందారు. దీంతో కోవిడ్ నిబంధనల ప్రకారం.. వైద్యులు మృతదేహానికి అంత్యక్రియలు జరిపే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఆరేపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య(70)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed