అరక కట్టిన ఎడ్లను ఢీకొని వ్యక్తి మృతి

by  |
అరక కట్టిన ఎడ్లను ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, జడ్చర్ల : ద్విచక్ర వాహనం అదుపుతప్పి అరక కట్టిన ఎడ్లను ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన జడ్చర్ల మండలంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదండాపూర్ గ్రామానికి చెందిన సుల్తాన్ (30) తన ద్విచక్రవాహనంపై అత్తగారి ఊరైన చిలువేరు నుండి జడ్చర్లకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో జడ్చర్ల మండలంలోని అల్వాన్ పల్లి గొల్లత్త గుడి వద్ద వ్యవసాయ పనులు ముగించుకొని అరక కట్టుకొని రోడ్డుపైనుండి వెళ్తున్న ఎడ్లను సుల్తాన్ ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వివరాలు సేకరించి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.



Next Story

Most Viewed