రిగ్గింగ్ జరిగింది.. వెంటనే పోలింగ్ ఆపాలని ఓటర్ నిరసన

by  |
man protest
X

దిశ, సిద్దిపేట: తెలంగాణలో ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో ఇవాళ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. సిద్దిపేట పట్టణంలోని మున్సిపల్ 24వ వార్డులో తన ఓటు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వేసి రిగ్గింగ్ చేశారంటూ సిద్దిరాములు అనే ఓటర్ ఆరోపించారు. 24వార్డులోనీ 70వ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన గుడ్ల సిద్దిరాములు అనే వ్యక్తి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి చూడగా అప్పటికే తన ఓటును ఎవరో వేశారని అధికారులు తెలిపారు. తన ఓటును ఇతరులు ఎలా వేస్తారని నిలదీశాడు. వెంటనే పోలింగ్‌ను ఆపాలని, తనకు ఓటు వేసే అవకాశం కల్పించాలని, లేదా రీ పోలింగ్ నిర్వహించాలని నిరసన వ్యక్తం చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు అతన్ని అక్కడ నుండి పంపివేయడంతో సదరు ఓటర్ నిరాశతో వెనుదిరిగాడు.


Next Story

Most Viewed