చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

by Batti.Sumithra |

<p>దిశ, మక్తల్ : రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో చికిత్స పొందుతున్న బాయికాడి అంజి(26) బుధవారం మృతి చెందినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. గాయపడిన వాళ్ళందరూ గుడిగండ్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ నెల 14న రాత్రి జక్లెర్-గుడిగండ్ల గ్రామాల మధ్య గల జాతీయ రహదారిపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో ఐదు మందికి గాయాలవగా, ఇద్దరు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స [&hellip;]</p>

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
X

దిశ, మక్తల్ : రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో చికిత్స పొందుతున్న బాయికాడి అంజి(26) బుధవారం మృతి చెందినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. గాయపడిన వాళ్ళందరూ గుడిగండ్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

ఈ నెల 14న రాత్రి జక్లెర్-గుడిగండ్ల గ్రామాల మధ్య గల జాతీయ రహదారిపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో ఐదు మందికి గాయాలవగా, ఇద్దరు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న బాయికాడి అంజి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

Next Story