- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కామారెడ్డి : మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. వినాయక మండపంలోకి చొరబడి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. గమనించిన నిర్వాహకులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మాచారెడ్డి మండలం లక్ష్మీరావుల పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి మండలం లక్ష్మీరావుల పల్లి గ్రామానికి చెందిన గంగాధర్ అనే యువకుడు మద్యం సేవించి గ్రామంలోని వినాయక మండపం వద్దకు వచ్చాడు. మద్యం మత్తులో మండపంలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న మండప నిర్వాహకులు గంగాధర్ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో మండపంలోని వినాయక విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి గంగాధర్ను పోలీసులకు అప్పగించారు. అయితే గత దసరా ఉత్సవాల వేడుకల్లో కూడా గంగాధర్ ఇదే విధంగా మద్యం సేవించి గలాటా సృష్టించాడని గ్రామస్థులు తెలిపారు.