విషాదం.. మొక్కలకు నీళ్లు పోస్తూ అనంతలోకాలకు

by  |
విషాదం.. మొక్కలకు నీళ్లు పోస్తూ అనంతలోకాలకు
X

దిశ, మంథని: రోడ్డు పక్కన మొక్కలకు నీళ్లు పడుతున్న సమయంలో వాటర్ ట్యాంకర్ మీద నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంథని మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామ శివారులో మంగళవారం రహదారి పక్కన ఉన్న మొక్కలకు స్వయం సేవక్ (25)అనే వ్యక్తి నీళ్లు పోస్తున్నాడు. ఈ క్రమంలో వాటర్ ట్యాంకర్ (ట్రాక్టర్) మీదకు ఎక్కాడు. ఒక్కసారిగా ట్రాక్టర్ ముందుకెళ్లడంతో అదుపుతప్పి చక్రాల కింద పడి అక్కడికక్కడే మరణించాడు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి తగిన సహాయక చర్యలు చేపట్టాలని పోలీసులు సూచించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed