పెళ్లికి ఒప్పుకోలేదని.. అలా చేసిన ప్రేమ జంట..

by  |
పెళ్లికి ఒప్పుకోలేదని.. అలా చేసిన ప్రేమ జంట..
X

దిశ, గూడూరు: మహబూబాద్ జిల్లా గూడూరు మండలం రాజన్ పల్లి అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగి ప్రేమికుల ఆత్మహత్య యత్నం చేశారు. కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన గూగులోత్ గణేష్ (23) అదే గ్రామానికి చెందిన జాటోత్ లావణ్య (19) గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.

కాని అమ్మాయి కుటుంబ సభ్యులకు ఇష్టం లేనందున అమ్మాయి కి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. దాంతో మనస్తాపానికి గురైన ఇరువురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story

Most Viewed