నిలబడే బస్టాండ్.. నిజాంపేట స్పెషల్..

by  |
నిలబడే బస్టాండ్.. నిజాంపేట స్పెషల్..
X

దిశ, నిజాంపేట్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బస్టాండ్లలో ప్రయాణికులు కూర్చునే అవకాశం కల్పించాలని లుక్స్ గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాహకులు అధికారులను కోరారు. మల్లంపేట్, బాచుపల్లి, నిజాంపేట్ మీదుగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ వరకు నిత్యం రద్దీగా వెళ్తుంటాయి. ఇక్కడ ఆర్టీసీ బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులు బస్టాండ్‌లలో వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు.

దీని వల్ల ప్రయాణికులు కూర్చునే అవకాశం లేక రోడ్ల పై గంటల తరబడి నిలబడాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. మున్సిపల్ అధికారులు, ఆర్టీసీ అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. బుధవారం ఉదయం నిజాంపేట్ రోడ్డు పై ఆర్ టీ సీ బస్సులు ఆపి నిరసన తెలిపారు. కార్యక్రమంలో లుక్స్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ బిక్షపతి యాదవ్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed