- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే అంబటి పేరిట భూకబ్జాదారులు బెదిరింపులకు పాల్పడటం సంచలనం సృష్టిస్తోంది. ఇటీవలె భూకబ్జా బాధితులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ భూకబ్జాదారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
భూయజమానులకే ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. మా వెనక బడా నేతలున్నారంటూ బ్లాక్ మెయిల్ ప్రారంభించారు. తాజాగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరు చెప్పి మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు భూకబ్జాదారులు. 174 సర్వే నంబర్ లో స్థలం గల బాధితుడికి ఫోన్ లో బెదిరింపులకు గురి చేశారు.
2017 లో 11 సెంట్లు స్థలం కొనుగోలు చేశాడు హనుమాప్రసాద్. కాగా “ఈ స్థలం దగ్గరకు వస్తే ముక్కలుగా నరుకుతాం, అంబటి కూడా వస్తున్నారు, నీ అంతు తేలుస్తాం” అంటూ కబ్జాదారులు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యాడు హనుమాప్రసాద్.