తామే యజమానులం అనుకోవద్దు : జనసేన

by  |
janasena party
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల బహిరంగ వేలం, ఆస్తుల అమ్మకాన్ని జనసేన పార్టీ వ్యతిరేకిచింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దేవాదాయ శాఖకు చెందిన భూములకు ప్రభుత్వం కేవలం ట్రస్టీగా మాత్రమే వ్యవహరిస్తూ… ఆస్తులను సంరక్షించాలి తప్ప అమ్ముకోవడానికి వీలు లేదని హెచ్చరించింది. దీనికి సంబంధించి హైకోర్టు తీర్పు కూడా ఉందని గుర్తు చేసింది. ప్రజల దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం వల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, అంతేగాకుండా మే 25వ తేదీన టీటీడీ ఆస్తుల విక్రయాన్ని నిలుపుదల చేస్తూ.. జీఓ 888ను కూడా ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.

ఈ నిలుపుదల ఉత్తర్వులనే రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, మఠాల ఆస్తులకు వర్తింపజేయాలని డిమాండ్ చేసింది. ధర్మ పరిరక్షణకు సంబంధించిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గితేనే ఇలాంటి వేలం, విక్రయం ప్రకటనలు వస్తాయని అన్నారు. దాతలు ఇచ్చిన ఆస్తులను నడి బజారులో అమ్మకానికిపెడితే.. భక్తుల మనోభావాలు దెబ్బతిని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని సూచించారు. దాతలు ఏ లక్ష్యంలో అయితే భూములు ఇచ్చారో దానికి మాత్రమే వినిగియోగించాలని డిమాండ్ చేశారు. దేవాలయ ఆస్తులకు ధర్మకర్తలుగా ఉండాల్సిన పాలకులు తామే యజమానులం అనుకోవద్దని హితవు పలికారు.

Next Story