చీర కొనుక్కుందని భార్యను ఇటుకతో కొట్టి చంపిన భర్త.. గతంలోనూ తీవ్రంగా కొట్టడంతో గర్భస్రావం

by  |
ap-crime
X

దిశ, వెబ్ డెస్క్: చీర కొనుక్కుందని భార్యను భర్త కొట్టి చంపిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రామచంద్రాపురానికి చెందిన యువతి, నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంకు చెందిన యువకుడు పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత భర్త రబ్బర్ బ్యాండ్లు, చెంపిన్నులు, ఇతర సామగ్రి విక్రయించేవాడు. అయితే, కొద్దిరోజుల తర్వాత అతను జూదానికి, తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో వీరికి ఒక కూతురు పుట్టింది. అయినా కూడా అతను మారకుండా తన ఫ్యామిలీని పట్టించుకోవడంలేదు. ఈ క్రమంలో చేసేదేమిలేక తప్పనిపరిస్థితుల్లో భిక్షాటన చేస్తూ అత్తమామలు, భర్తను, తన కూతురిని పోషించేది. భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులను కూడా ఆమె నుంచి భర్త లాక్కునేవాడు. ఇయ్యకపోతే ఆమెను కొట్టేవాడు. ఇలాగే ఓసారి ఆమెను తీవ్రంగా కొట్టడంతో ప్రెగ్నెంట్ గా ఉన్న ఆమెకు గర్భస్రావమైంది.

ఆ తర్వాత ఇటీవల ఆమె తన భర్తకు తెలియకుండా రూ. 200తో చీర కొనుక్కుంది. ఈ విషయం తన భర్తకు తెలియడంతో బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నుంచి ఆమెను లాక్కొచ్చి ఇటుక రాయితో తీవ్రంగా కొట్టాడు. ఆ సమయంలో అడ్డుకోవాల్సిన అత్త కూడా భర్తకే సపోర్ట్ చేసింది. భర్త తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పోలీసులకు విషయం తెలియజేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని భర్తను, అత్తను అరెస్ట్ చేశారు.



Next Story