దారుణం : నాటు తుపాకీతో భార్యను కాల్చిన భర్త.. కారణం అదేనా ?

by  |
దారుణం : నాటు తుపాకీతో భార్యను కాల్చిన భర్త.. కారణం అదేనా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నాటు తుపాకీతో భార్యను భర్త కాల్చి చంపిన ఘటన జిల్లాలోని మెలియాపుట్టి మండలం భరణికోట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. భర్త సవర జగ్గారావు(38) భార్య సవర పద్మ దంపతులు కొన్ని రోజులుగా భరణికోట గ్రామంలో నివాసం ఉంటున్నారు. అయితే వీరి మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. అదే విధంగా ఆదివారం భార్య భర్తల మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త జగ్గారావు భార్యను కాల్చడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఆస్పత్రికి తరలించారు.

Next Story

Most Viewed