- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో : జీవితాంతం నీతోనే కలుసుంటానని పెళ్లినాటి ప్రమాణాన్ని మరచిపోయాడు. అగ్ని సాక్షిగా కట్టిన తాళిని ఎగతాళి చేశాడు. సంసారం చేసి ఓ బిడ్డకు తండ్రి అయిన తర్వాత నువ్వు నల్లగా ఉన్నావు వద్దంటూ వదిలించుకునే ప్రయత్నం చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ షాకింగ్ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే చీరాల మద్దివారివీధికి చెందిన పవన్ కుమార్కు చిలకలూరిపేటకు చెందిన కంకిపాటి తులసితో పెళ్లి అయ్యింది. ఇరు కుటుంబ సభ్యులు ఘనంగా వివాహం జరిపించారు. వీరికి సంతానం కూడా కలిగింది. పెళ్లైన కొన్నేళ్లు ఎంతో సంతోషంగా సాగిన వీరి సంసారంపై ఎవరి కన్నుకుట్టిందో తెలియదుగానీ ఇద్దరి మధ్య గొడవలు మెుదలయ్యాయి.
భర్త పవన్ కుమార్తో పాటు అత్తమామలు నల్లగా ఉన్నావంటూ కోడలు తులసిని ఇంట్లోకి రానియ్యడం లేదు. ఈ విషయంలో గతంలోనే చిలకలూరిపేటలో భర్త, అత్తమామలపై కేసు పెట్టింది. దీంతో పవన్ కుమార్ మరింత రెచ్చిపోయాడు. భార్యకు కోర్టు ద్వారా నోటీసులు పంపించాడు. దీంతో తులసి గురువారం తన బిడ్డతో కలిసి అత్తింటికి వెళ్లింది. అయితే వారు ఇంట్లోకి రానియ్యలేదు. అంతేకాదు భర్త, అత్తమామలు ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. దీంతో తులసి తన బిడ్డతో కలిసి అక్కడే నిరసనకు దిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దంపతుల మధ్య వివాదం కోర్టులో నడుస్తోందని ఆమెకు చెప్పారు. న్యాయం చేసేలా ప్రయత్నిస్తామని పోలీసులు బాధితురాలికి హామీ ఇవ్వడంతో ఆమె నిరసనను విరమించింది.