ఉద్యోగులకు క్రికెట్ టోర్నమెంట్.. హోం మినిస్టర్ కు ఆహ్వానం..

by  |
ఉద్యోగులకు క్రికెట్ టోర్నమెంట్.. హోం మినిస్టర్ కు ఆహ్వానం..
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: లాల్‌బ‌హ‌దూర్ స్టేడియంలో ఈనెల 9, 10వ తేదీన జ‌రిగే క్రికెట్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా హాజ‌రు కావాల‌ని రాష్ట్ర హోం శాఖా మంత్రి మ‌హ‌మూద్ అలీని టీఎన్జీఓ హైద‌రాబాద్ జిల్లా అధ్యక్షులు డా. ఎస్‌.ఎం హుస్సేన్ ఆధ్వర్యంలో సెంట్రల్ యూనియ‌న్ అధ్యక్షులు మామిళ్ల రాజేంద‌ర్‌, ప్రధాన కార్యద‌ర్శి రాయ‌కంటి ప్రతాప్‌లు ఆహ్వానించారు.

ఈ మేర‌కు శుక్రవారం వారు హోంమంత్రిని మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగుల క్రీడోత్సవాల‌లో త‌ప్పక హాజ‌ర‌వుతాన‌ని మంత్రి వారికి హామి ఇచ్చారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ‌క్ఫ్ బోర్డు చైర్మన్ మ‌హమ్మద్ స‌లీమ్‌ను కూడా ఆహ్వానించారు.

Next Story

Most Viewed