యాదాద్రి గురించే ఈ తాజా వార్త

by  |
యాదాద్రి గురించే ఈ తాజా వార్త
X

దిశ, ఆలేరు: యాదాద్రిలో ఈనెల 29 నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. శ్రావణమాసం మొదలయ్యాక ఈనెల 29 నుంచి 31వరకు ఉత్సవ పర్వాలను నిర్వహించేందుకు ఆలయ పూజారులు ఏర్పాట్లకు ఉపక్రమించారు. 30, 31 తేదీల్లో శ్రీ సుదర్శన నారసింహ హోమం, శ్రీ లక్ష్మీనరసింహ నిత్య కల్యాణోత్సవ పర్వాలను రద్దుపరిచినట్లు ఆలయ ఈవో తెలిపారు. పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ పవిత్రోత్సవాలు జరగనున్నాయి.



Next Story

Most Viewed