ఆనందయ్య కంటి మందుపై నేడు హైకోర్టులో విచారణ

by  |
ఆనందయ్య కంటి మందుపై నేడు హైకోర్టులో విచారణ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆనందయ్య మందు పంపిణీ‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే సీఎం జగన్ ఆనందయ్య కరోనా మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కంటిలో వేసుకునే చుక్కల మందుకు పూర్తి స్థాయి నివేదికలు రానందున కంటిమందు మినహా మిగితావాటికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో కంటి మందుకు అనుమతి ఇవ్వాలని ఆనందయ్య వేసిన పిటిషన్‎ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇదే సమయంలో కంట్లో చుక్కల మందుపై తమకు రెండు వారాల సమయం కావాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు విచారణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed