ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం.. సర్కార్ తీరుపై హైకోర్టు సీరియస్..

by  |
TS-High-Court
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ వివాదంపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీజే జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారించింది. అయితే, విచారణ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆసుపత్రి నిర్మాణంపై ఏ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆసుపత్రిని పూర్తిగా కూల్చి కొత్తగా ఆసుపత్రిని నిర్మిస్తారా.? లేక.. కొన్ని బ్లాక్‌లు నిర్మిస్తారా చెప్పాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే, ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తోందని ఏజీ ప్రసాద్.. హైకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో నిర్ణయం తీసుకునేందుకు ఎన్నేళ్లు కావాలని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆసుపత్రి విషయంలో ప్రభుత్వం తీరు దురదృష్టకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోవద్దని కోర్టు ప్రశ్నించింది. విచారణలో భాగంగా ఆసుపత్రి నిర్మాణంపై 6 వారాల్లో తుది నిర్ణయం తీసుకొని బ్లూ ప్రింట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.



Next Story

Most Viewed