రఘురామ కృష్ణంరాజుకు షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

by  |
రఘురామ కృష్ణంరాజుకు షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, అలాంటి వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొట్టారని సీఐడీ స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో తన అరెస్టు అక్రమమని బెయిల్ మంజూరుచేయాలని కోరుతూ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై నేడు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు రఘురామ కృష్ణంరాజు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. జిల్లా కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకు వచ్చారని ఆయన్ను ప్రశ్నించింది. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.

Next Story

Most Viewed